హైదరాబాద్ లో మరోసారి పెద్దమొత్తంలో గంజాయి పట్టుబడింది. అంబర్పేట ORR దగ్గర ఎస్వోటీ పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. ORR దగ్గర కంటెయినర్ను తనిఖీ చేసిన పోలీసులు.. అందులో భారీగా గంజాయి ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 370 కిలోల గంజాయిని సీజ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి నుంచి హైదరాబాద్కు గంజాయిని తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.