కేంద్ర ప్రభుత్వం పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం. దేశ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, వృద్ధి రేటు రోజురోజుకూ పడిపోతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్వహించిన ఓ సమావేశంలో చిదంబరం పాల్గొని మాట్లాడారు. ద్రవ్యోల్బణం ఎన్నడూ ఊహించని స్థాయికి చేరుకుందని అన్నారు.
పెట్రోల్, డీజిల్ పన్నులు కూడా ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణాలని చిదంబరం విమర్శించారు. భారత ఆర్థిక వ్యవస్థ దిగజారడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న విదేశీ వ్యవహారాలు కూడా ఓ కారణమని చెప్పారు. ఊహించని స్థాయికి ద్రవ్యోల్బణం పెరిగిందని తెలిపారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నప్పటికీ దాన్ని కేంద్ర ప్రభుత్వం కట్టడి చేయలేకపోతోందని విమర్శించారు చిదంబరం.