రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సెలవులు పొడిగించిన రాష్ట్ర విద్యాశాఖ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 24 నుంచి ప్రభుత్వ స్కూళ్లోని 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా తరగతులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది సైతం రోటేషన్ పద్ధతిలో 50 శాతం మంది మాత్రమే విధులకు హాజరుకావాలని పేర్కొంది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.