వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల ఎన్నికల అధికారులతో ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర నేతృత్వంలో భేటీ జరుగుతుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై చర్చ చేస్తున్నట్లు సమాచారం.