ప్రముఖ శైవక్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్నాథ్ ఆలయాన్ని ఇవాళ తెరిచారు. ఉదయం 6.26 గంటలకు వేద మంత్రోచ్ఛారణలు, శివనామ స్మరణమధ్య ఆలయ ద్వారాలు తెరుచుకోవటంతో భక్తులు పులకించిపోయారు. కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామి సహా దాదాపు 10 వేల మంది భక్తులు పాల్గొన్నారు. ఆలయ పునఃప్రారంభం సందర్భంగా క్షేత్రాన్ని 15 క్వింటాళ్ల పూలతో అలంకరించారు. ఆరు నెలల తర్వాత కేదారేశ్వరుని ఆలయాన్ని తెరిచారు. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకతే ది. ఏడాది లో ఎక్కువ కాలం మంచుతో కప్పుకొని ఉంటుంది. ఆ సమయంలో వాతావారణం బాగుండని కారణంగా క్షేత్రాన్ని ముసివేస్తారు. ఎండకాలంలో మళ్లీ ఆలయాన్ని తెరుస్తారు. కరోనా కారణంగా రెండేండ్లపాటు నిలిచిపోయిన చార్ధామ్ యాత్ర ఈ నెల 3న ప్రారంభమైంది. గంగోత్రి, యమునోత్రి ఆలయాలను భక్తుల కోసం మంగళవారం తెరిచారు. బద్రినాథ్ ఆలయాన్ని 8 న తెరవనున్నారు.
#WATCH | The doors of Kedarnath Dham opened for devotees. Kedarnath's Rawal Bhimashankar Linga opened the doors of Baba Kedar. On the occasion of the opening of the doors thousands of devotees were present in the Dham. pic.twitter.com/NWS4jtGstb
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 6, 2022