సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ ఐపీఎల్ నియమావళిని ఉల్లంఘించారు. దీంతో రిఫరీ వెంగలిల్ నారాయణ్ కుట్టీ ఆర్సీబీ కెప్టెన్ను మందలించాడు. 2016లో ఇదే బెంగళూరుతో మ్యాచులో గౌతమ్ గంభీర్ ఇలాగే చేయడంతో అతడి మ్యాచు ఫీజులో 15% కోత విధించారు. కానీ కోహ్లీ మాత్రం కేవలం మందలింపుతో బటయపడటం గమనార్హం.
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచులో విరాట్ 29 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 33 పరుగులు చేశిండు. స్కోరు వేగం పెంచే క్రమంలో జేసన్ హోల్డర్ వేసిన 12.1 ఓవర్లో కోహ్లీ భారీ షాట్ కొట్టిండు. లాంగ్ లెగ్లో ఉన్న ఫీల్డర్ విజయ్ శంకర్ వేగంగా పరుగెత్తుకుంటూ.. అద్భుతంగా డైవ్ చేసి క్యాచ్ను పట్టిండు. ఔటైన ఆవేశంలో కోహ్లీ.. డగౌట్కు చేరుకొని అడ్వర్టైజ్మెంట్ కుషన్, కుర్చీని తన్నిండు. దాంతో అతడిపై ఐపీఎల్ నియమావళిలోని లెవల్ 1 నిబంధనలను ఉల్లంఘించినట్లు అభియోగాలు నమోదయ్యాయి.