అన్నను స్కూల్ బస్సు ఎక్కించడానికి అమ్మమ్మతో కలిసి వెళ్లిన చెల్లి.. అదే బస్సు కింద పడి దుర్మరణం చెందింది. ఈ విషాద ఘటన హబ్సీగూడలో గురువారం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో జాన్సన్ గ్రామర్ స్కూల్ బస్సు రోజూవారీ మాదిరిగానే పిల్లలను ఎక్కించుకురావడానికి రవీంద్రనగర్కు వెళ్లింది. అక్కడ ఓ చిన్నారి తన అన్నను బస్సు ఎక్కించడానికి అమ్మమ్మతో కలిసి వచ్చింది. పాప తండ్రి బాబును బస్సు ఎక్కిస్తుండగా.. పాప అమ్మమ్మ నుంచి విడిపించుకొని బస్సు ముందుకు వచ్చింది. అది ఎవరూ గమనించకపోవడంతో.. డ్రైవర్ బస్సును ముందుకు పోనిచ్చాడు. దాంతో పాప బస్సు కింద పడి చనిపోయింది. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే పాప చనిపోయిందని, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఓయూ పోలీసులు చిన్నారి మృతదేహాన్ని గాంధీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.