తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయు అర్హత పరీక్ష (TS TET) ఫలితాలను ఇవాళ(బుధవారం) ఉదయం 10 గంటలకు విడుదలయ్యాయి. టెట్ పేపర్-1లో 36.89 శాతం ఉత్తీర్ణత సాధించగా… పేపర్-2లో కేవల 15.30 శాతం మాత్రమే ఉత్తీర్ణత నమోదైంది. పేపర్-2 మ్యాథ్స్, సైన్స్ విభాగంలో 18.66 శాతం, సోషల్ స్టడీస్ విభాగంలో 11.47 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అభ్యర్థులు ఫలితాలను https://tstet.cgg.gov.in/ అధికారిక వెబ్సైట్లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
టీఎస్ టెట్ పేపర్-1కు 2.26 లక్షల మంది అభ్యర్థులు, పేపర్-2కు 1.90 లక్షల మంది హాజరయ్యారు. పరీక్షలు సెప్టెంబర్ 15న జరుగగా సెప్టెంబర్ 20న టెట్ ప్రాథమిక కీని విడుదల చేశారు అధికారులు. సెప్టెంబర్ 23 వరకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. ఇవాళ పరీక్ష ఫలితాలను రిలీజ్ చేశారు.