హైదరాబాద్ : యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పరామర్శించారు. కేటీఆర్ను కలిసి.. కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రకాశ్ రాజ్ ఆకాంక్షించారు.
Also Read.. ఆర్టికల్ 370పై సుప్రీం సంచలన తీర్పు..జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై కీలక ఆదేశాలు..!!
మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు మధుసూదన చారి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, బీఆర్ఎస్ నాయకుడు చల్మడ లక్ష్మి నరసింహారావు తదితరులు కూడా కేసీఆర్ పరామర్శించారు. ఆరోగ్యపరిస్థితి గురించి తెలుసుకొని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.