ఆస్ట్రేలియా విధ్వంసక బ్యాట్స్ మన్ గ్లెన్ మ్యాక్స్ వెల్ టీ20 క్రికెట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. ఇవాళ(ఆదివారం) వెస్టిండీస్ తో రెండో టీ20లో మ్యాక్స్ వెల్ మెరుపు సెంచరీ నమోదు చేశాడు. 50 బంతుల్లో 8 సిక్సులు, 12 ఫోర్లతో 120 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
మ్యాక్స్ వెల్ కు టీ20 కెరీర్ లో ఇది 5వ సెంచరీ. దీంతో ఈ డైనమిక్ బ్యాటర్… టీ20 క్రికెట్లో అత్యధిక సెంచరీల లిస్టులో రోహిత్ శర్మ సరసన చేరాడు. ఇప్పటి వరకు రోహిత్ శర్మ టీ20 క్రికెట్లో 5 సెంచరీలతో టాప్ లో ఉన్నాడు.
ఇది కూడా చదవండి: తెలంగాణ నీళ్ల హక్కులు కృష్ణార్పణం