సంగారెడ్డి జిల్లా తార ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో దారుణం జరిగింది. డిగ్రీ చదివే విద్యార్థినిపై ప్రేమోన్మాది ప్రవీణ్ బ్లేడుతో హత్యాయత్నం చేశాడు. అయితే, చేతికి స్వల్ప గాయాలతో విద్యార్థిని అఖిల బయట పడ్డది. ప్రస్తుతం కాలేజీలోనే అఖిల పరీక్షలు రాస్తున్నది. ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.