Monday, May 20, 2024

దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

spot_img

హైదరాబాద్ జవహర్ నగర్ లో విషాదం చోటుచేసుకున్నది. ప్రియుడుతో కలిసి ఓ భార్య తన భర్తను హత్య చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్ నగర్ లో స్వామి, కావ్య అనే దంపతులు నివసిస్తున్నారు. గత కొంత కాలంగా ఓ క్యాబ్ డ్రైవర్ తో కావ్య వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ప్రియుడుతో కలిసి తిరుగుతుందని గుర్తించిన భర్త.. కావ్యను పలుమార్లు హెచ్చరించాడు. దీంతో ఎలాగైన భర్తను చంపాలని భార్య ప్లాన్ వేసింది. ప్రియుడు ప్రణయ్ తో కలిసి భర్తను చంపింది కావ్య. తమ స్నేహితులు రోహిత్, నగేష్ లు హత్యకు సహకరించారు. ఇందుకోసం ఇటీవల కావ్య ఓ లోన్ యాప్ ద్వారా రూ.8 లక్షలు తీసుకొని ప్రియుడికి ఇచ్చిందని పోలీసులు తెలిపారు. హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

Also Read.. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా క‌ష్ట‌మే

Latest News

More Articles