Monday, May 20, 2024

ANRని ఇమిటేట్ చేసిన బ్రహ్మానందం

spot_img

హైదరాబాద్: అక్కినేని నాగేశ్వరరావు(ఏఎన్నార్‌) కారణజన్ముడు అని సినీ నటుడు బ్రహ్మానందం కొనియాడారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో అట్టహాసంగా నిర్వహించిన ఏఎన్నార్‌ శతజయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Also Read.. పాల‌కుర్తి మెగా జాబ్ మేళాకు భారీ స్పంద‌న‌

ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొని అక్కినేని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అక్కినేని కుటుంబసభ్యులతో పాటు సినీ రంగానికి చెందిన ప్రముఖులు, డీజీపీ అంజనీకుమార్‌ తదితరులు హాజరయ్యారు.

Also Read.. రూ. 300లకే 200 గజాల భూమి, రూ. లక్ష లోన్ అంటూ..

ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ.. ఏఎన్నార్‌ రైతుకుటుంబంలో పుట్టి అద్భుతమైన స్థితికి చేరుకున్నారని కొనియాడారు. ఇది సామాన్యమైన విషయం కాదన్నారు. నటన అనే అర్హతతో మహోన్నత వ్యక్తిగా ఏఎన్నార్‌ మారారని పేర్కొన్నారు. ఆయన క్రమశిక్షణ చాలా కఠినంగా ఉంటుందన్న ఆయన ఏఎన్నార్‌కు వచ్చినన్ని అవార్డులు ఇంకెవరికీ రాలేదని.. ఆయన పొందిన సన్మానాలు ఇంకెవరికీ జరగలేదని తెలిపారు. తన ప్రసంగంలో భాగంగా ప్రేమ్ నగర్ సినిమాలోని అక్కినేని నాగేశ్వరరావు స్టైల్ లో యాక్టింగ్ చేసి.. ఆయనపై తన అభిమానాన్ని చాటుకున్నారు.

Latest News

More Articles