ఓటరు నమోదు కార్యక్రమానికి ఆధార్ కార్డు తప్పనిసరి కాదని, అది ఆప్షనల్ మాత్రమేనని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఫారమ్ 6బీలో అవసరమైన మార్పులు చేస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. ఓ రిట్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు అండర్ టేకింగ్ను సమర్పించింది. ఇప్పటికే 66 కోట్లకు పైగా ఆధార్ కార్డులను ఓటర్ కార్డులతో జత చేసినట్లు తెలిపింది. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రోరల్స్ సవరణ రూల్స్ 2022 కింద ఆధార్ తప్పనిసరి కాదని చెప్పింది.
ఎన్నికల గుర్తింపు కార్డుతో ఆధార్ నెంబర్ను అనుసంధానం చేసేందుకు వీలుగా కేంద్రం గతేడాది జూన్లో ఓటర్ల నమోదు రూల్స్ 2022ని నోటిఫై చేసింది.