రంగారెడ్డి జిల్లా: మణికొండ మున్సిపాలిటీ కౌన్సిల్ మీటింగ్లో గందరగోళం నెలకొన్నది. మున్సిపాలిటీలో ఒంటెద్దు పొకడపై కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేసారు. మంగళవారం జరిగిన కౌన్సిల్ మీటింగ్ లో పెట్టిన ఎజెండాని వారు తిరస్కరించారు. అత్యవసరమైన పనులకు ప్రాధాన్యత ఇవ్వకుండా, అవసరం లేని పనులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడంపై కమిషనర్ ని ప్రశ్నించారు కౌన్సిలర్లు.
మణికొండ మున్సిపాలిటీ చైర్మన్ ఎమ్మెల్యేగా పోటీ చేయడం వల్ల దాదాపు 5 నెలలుగా మీటింగ్ పెట్టకుండా, ఇష్టానుసారం ఎజెండాను రూపొందించి, కనీసం కౌన్సిలర్లను సంప్రదించకుండా, కౌన్సిల్ లో ప్రవేశపెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. సాధ్యమైనంత తొందరలో కౌన్సిలర్లను సంప్రదించి మళ్లీ మీటింగ్ పెట్టాలని, ఎజెండాలో అత్యవసరమైన పనులే పెట్టాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు.
Also Read.. ఇప్పుడు పార్టీ కోసం పనిచేస్తున్న వారే భవిష్యత్తు నాయకులు