Monday, May 20, 2024

రైతు బంధుపై ప్ర‌శ్నిస్తే చెప్పుతో కొడ‌తానంటావా?

spot_img

యాదాద్రి భువనగిరి: వచ్చే ఎన్నికల్లో ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని, ఎవరూ అధైర్య పడొద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి కార్యకర్తలకు భరోసానిచ్చారు. భువనగిరి నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అధికారం ఉందని రెచ్చిపోతే రాజకీయాలలో కనుమరుగు అవుతారని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి హెచ్చరించారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేకపోతున్నదని అన్నారు. అసెంబ్లీ సమావేశాలలో ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక రేవంత్ ప్రభుత్వం బొక్కబోర్లా పడిందన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అహంకారపూరితంగా మాట్లాడుతున్నడని, రైతుబంధు అడిగితే చెప్పుతో కొట్టండని అనడం సిగ్గుచేటన్నారు. వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు గతంలో వైఎస్సార్, చంద్రబాబుల బూట్లు తుడిచేవారని విమర్శించారు.

Also Read..  విద్యుత్ వినియోగదారులకు రాష్ట్ర‌ స‌ర్కారు అల‌ర్ట్

Latest News

More Articles