Monday, May 13, 2024

రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉండాలి.. శత్రువులుగా ఉండొద్దు

spot_img

రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉండాలి కానీ.. శత్రువులుగా ఉండొద్దన్నారు కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్. రాజకీయ నాయకులు క్రీడాకారులను చూసి నేర్చుకోవాలన్నారు. ఇవాళ(శనివారం) క‌రీంనగర్ అంబేద్కర్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియంలో కరీంనగర్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు.

ఆ తర్వాత మాట్లాడిన వినోద్ కుమార్… క్రీడల్లో గెలుపోటములు సహజమని.. ఓటమి చెందిన క్రీడాకారుడు పట్టుదలతో ప్రాక్టీస్ చేసి మళ్లీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తాడని తెలిపారు. క్రీడల్లో గెలుపోటములు సమానంగా స్వీకరించిన్నప్పుడే క్రీడల్లో రాణిస్తారని…రాజకీయ నాయకులు కూడా క్రీడాకారులను చూసి గెలుపోటములను సమానంగా తీసుకోవాలి.. కానీ శతృత్వం పెంచుకోవద్దన్నారు. గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడాకారుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత కల్పించిందన్నారు.  పార్లమెంట్ సభ్యునిగా తాను అథ్లెటిక్స్ క్రీడాకారుల కోసం రూ.7 కోట్లతో సింథటిక్ ట్రాక్ వేసినట్లు చెప్పారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ నాయకులు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్‌ని సన్మానించారు.

ఇది కూడా చదవండి:కాంగ్రెస్-బీజేపీది ఫెవికాల్ బంధం

Latest News

More Articles