రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో పరిధిలో సాగర్ రహదారి తుర్కయంజాల్ కూడలిలో అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం, సిమెంట్ లోడుతో ఉన్న లారీ డీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందగా.. మరో వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.