తిరుమలలో ఇవాళ(గురువారం) భారీ వర్షం కురిసింది. ఉదయం ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారి ఈదురుగాలులతో కూడిన వాన దంచి కొట్టింది. భారీ వర్షం కారణంగా ఆలయం చుట్టు పక్కల రోడ్లన్నీ జలమయం అయ్యాయి. క్యూ లైన్లోకి వర్షపు నీరు చేరుకోవడంతో.. దర్శనం కోసం వచ్చిన భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అలాగే అనేక ప్రాంతాలలో మోకాలి లోతులో నీళ్లు నిలవడంతో తొలిగించే పనిలో పడ్డారు తిరుమల సిబ్బంది.
గత కొద్ది రోజులుగా ఎండలతో తీవ్ర ఇబ్బంది పడిన ప్రజలు..వర్షం కురవడంతో ఎండ వేడిమి నుంచి రిలాక్స్ అయ్యారు.