రంగారెడ్డి జిల్లా నార్సింగి ఏరియాలో ఇవాళ(శనివారం) ఉదయం కుటుంబ కలహాలతో భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామంలో ఐదు నెలలుగా ఆర్ఎంపీ డాక్టర్ నాగరాజు, సుధ దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఇద్దరి మధ్య అది కాస్తా తారస్థాయికి చేరడంతో నాగరాజు.. కత్తితో భార్య సుధ గొంతుకోసి హతమార్చాడు. తల్లిని చంపుతుండగా అడ్డొచ్చిన పెద్ద కుమారుడు దీక్షిత్నూ(8) హత్య చేసేందుకు నాగరాజు ప్రయత్నించగా.. బాలుడు అక్కడి నుంచి పారిపోయాడు.
భార్యను హత్య చేసిన తర్వాత నాగరాజు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు.. దంపతుల మృతదేహాలను పోస్టమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబకలహాల నేపథ్యంలోనే భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.