లాంగ్ వీకెండ్ రావటంతో కిక్కిరిసిన జనల మధ్య ఉప్పల్ టెస్ట్ మ్యాచ్ పండగల సాగుతుంది. తొలుత చేతులెత్తేసిన ఇంగ్లాండ్ జట్టు పట్టు బిగించిది. ఇన్నింగ్స్ తేడాతో గెలవగలం అనుకున్నమ్యాచ్ ని కాస్త టైట్ చేసింది ఇంగ్లాండ్. తొలుత ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ 246 ఆల్ ఔట్ కాగా భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ 436 ఆల్ ఔట్ అయింది/ 200కి పైచిలుకు లీడ్ రావటంతో ఇంగ్లాండ్ పని అయిపోయిందనుకున్నారు అంతా కానీ అనూహ్యంగా పుంజుకుని ఇంగ్లండ్ సెకండ్ ఇన్నింగ్స్ 420 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది.
దాంతో 231 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందుంచింది ఇంగ్లండ్. ఇక భారత్ తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే ఇంగ్లాండ్ ఆటగాడు పోప్ తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకోవటం గమనార్హం. ఇక భారత్ బౌలింగ్ మొదటి ఇన్నింగ్స్ లో జడేజా 3, అశ్విన్ 3, బూమ్రా 2, అక్షర్ పటేల్ 2 వికెట్లు పడగొట్టగా.. రెండో ఇన్నింగ్స్ లో బూమ్రా 4 వికెట్లు, అశ్విన్ 3, జడేజా 2, అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు.