న్యూఢిల్లీ: చివరి టీ20లో భారత్ పరాజయం పాలయింది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ వెస్టిండీస్ గెలుచుకుంది. మొదటి రెండు మ్యాచ్ల్లో గెలిచిన విండిస్.. ఆఖరి మ్యాచ్లోనూ విజయాన్ని చేజిక్కించుని 3-2తో సిరీస్ను సొంతం చేసుకుంది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా 165 పరుగులు చేసింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఓపెనర్లు రాణించారు. నికోలస్ పూరన్, బ్రాండెన్ కింగ్ చెలరేగి ఆడటంతో 166 పరుగుల విజయలక్ష్యాన్ని అలవోకగా ఛేదించారు.