కొద్ది రోజులుగా ఎన్నో ఊహాగానాల మధ్య జనతాదళ్ (యునైటెడ్) అధ్యక్షుడు నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు, పొత్తు సరిగ్గా లేదు అంటూ పాలక ప్రభుత్వం నుండి వైదొలగడానికి ‘మహాఘటబంధన్’తో సంబంధాలను తెంచుకున్నారు. పాట్నాలోని రాజ్భవన్లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్కు తన రాజీనామాను సమర్పించారు నితీష్ కుమార్.
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడి), కాంగ్రెస్లతో కూడిన మహాఘట్బంధన్తో తమ పార్టీ బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అయితే బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం నితీష్ కుమార్ మొదటిసారి స్పందించారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్ను కోరినట్లు చెప్పారు. రాజ్భవన్ వెలుపల విలేకరులతో నితీష్ కుమార్ మాట్లాడుతూ, “ఈ రోజు, నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాను. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్కు కూడా చెప్పాను అని అన్నారు నితీష్ కుమార్.