Sunday, May 12, 2024

నీచ సంస్కృతి రేవంత్ రెడ్డిది.. పట్నం నరేందర్ రెడ్డి ఫైర్

spot_img

కొస్గి: ప్రజాదారణ కరువై డబ్బులతో, మద్యంతో గెలవాలని నీచమైన రాజకీయాలకు రేవంత్ రెడ్డి తెరలేపారని కొడంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. కొస్గిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ కు ఓటమి భయం పట్టుకుందన్నారు. మొన్న బొంరాస్ పేట, దుద్యాల ప్రాంతాలలో ఆయన ప్రచారానికి జనాదారణ లేక వెలవెల బోయాయని తెలిపారు.  దీంతో ఓటమి భయంతో సర్జఖాన్ పేట గ్రామంలో తమ కార్యకర్తలపై దాడులకు దిగడం దారుణమని అన్నారు.

జగన్నాథ్ రెడ్డి మా బంధువు. మా మామయ్య రఘునాథ్ రెడ్డి. ఆయన ఇప్పుడు లేరు. ఇది తెలియని రేవంత్ గెలిచే ధైర్యం లేక ఎమ్మెల్యే స్వంత మామ‌ అని సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి తెగబడ్డాడని మండిపడ్డారు. అండగా నిలిచిన ప్రజల అభివృద్ధి మరిచి హైదరాబాద్ కే పరిమితయ్యాడు కాబట్టే రేవంత్ ను కోడంగల్ ప్రజలు తరిమికొట్టారని పేర్కొన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి తమ పార్టీని విజయ తీరాలకు చేరుస్తుందని తెలిపారు.

Latest News

More Articles