పెట్టుబడుల నిర్వహణ సంస్థ మ్యాన్ గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. 240 ఏండ్లలో మొదటి సారిగా మహిళా సీఈవో గా రాబిన్ గ్రూను నియమించింది. ప్రస్తుతం సీఈవోగా పనిచేస్తున్న ల్యూక్ ఎల్లిస్ సెప్టెంబర్ 1న పదవీ విరమణ చేయగానే రాబిన్ గ్రూ బాధ్యతలు చేపట్టనున్నారు.
లండన్ కేంద్రంగా 1783 లో ప్రారంభమైన ఈ కంపెనీ 2వందల ఏండ్ల పాటు రాయల్ నేవీకి రమ్, చక్కర ఉత్పత్తులను సరఫరా చేసింది. ప్రస్తుతం ఆర్థిక సేవల రంగంలో కొనసాగుతోంది.