ఈ నెల 9న జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో మహబూబ్ నగర్ జిల్లా స్థానికులకు పెద్ద ఎత్తున జాబ్ మేళా నిర్వహిస్తున్నామని… ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. యువత ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వచ్చే నెలలో 10 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా మరో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. మంగళవారం ఆయన సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలో సమావేశం మందిరంలో ఆయన ప్రభుత్వ ప్రాధాన్య పథకాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు