Monday, May 13, 2024

ఐటీ దాడులతో బయపడేదిలేదు

spot_img

హైదరాబాద్: భువనగిరి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి  ఆఫీస్ లపై  ఐటీ దాడుల పై  మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల పై జరిగే ఐటీ దాడులు బీజేపీ ప్రేరేపిత దాడులేనని మండిపడ్డారు. విచారణ సంస్థలను అడ్డం  పెట్టుకుని ప్రతిపక్షాలపై బీజేపీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విపక్షనేతలపై కేసులు పెట్టి బయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మా వారంతా తెరిచిన పుస్తకాలే, వైట్ పేపర్ వ్యాపారాలే. పార్టీలోకి రాక ముందు నుండే వారికి వ్యాపారాలు ఉన్నాయి. పన్నులు లెక్క ప్రకారమే చెల్లిస్తున్నారు. ఐటీ దాడులతో బయపెట్టడం మూర్ఖత్వమే. దాడులకు బయపడేదిలేదు. దాడులతో ప్రజలను, ప్రతిపక్షాన్ని అణచివేయడం అప్రజాస్వామికం. ఎన్ని దాడులు చేసినా మేము ప్రజల పక్షమే.’’ అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.

Latest News

More Articles