Monday, May 20, 2024

కోహ్లీ సెంచరీలా బీఆర్ఎస్ 100 సీట్లు సాధిస్తుంది

spot_img

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆదివారం కోహ్లీ సెంచరీ కొట్టాడు మనం కూడా ఎన్నికల్లో 100 సీట్లు గెలవాలని మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సిరిసిల్ల తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ టెక్ సెల్ వింగ్ ను కొప్పుల ఈశ్వర్, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. అనంతరం వైయస్సార్ టిపి పార్టీ జిల్లా అధ్యక్షుడు చోక్కాల రాముతో  పాటు 200 మంది కార్యకర్తలను బిఆర్ఎస్ పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించారు.

Also Read.. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోనే కాంగ్రెస్ పార్టీ కాపీ కొట్టింది

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేసేలా కృషి చేయాలన్నారు. కులాల పేరిట పంచాయితీ పెట్టని కేసీఆర్.. అభివృద్ధే ధ్యేయంగా మంచి పనులు చేస్తున్నట్లు తెలిపారు. సిరిసిల్లలో ప్యారచుట్  నాయకులను దించుతున్నారని విమర్శించారు. జేబుల వంద రూపాయలలాంటి కేసీఆర్ కాపాడుకోవాలని,  చిల్లర పైసల లెక్క ఉన్న నాయకులను పట్టించుకోవద్దని పిలుపునిచ్చారు. బీజెపి, కాంగ్రెస్ పార్టీ చేతిలో పెడితే తెలంగాణా రాష్ట్రం దయ్యాల పాలు అవుతుందన్నారు.

Latest News

More Articles