Monday, May 20, 2024

భారతదేశానికి దిక్సూచిలా తెలంగాణ రాష్ట్ర పథకాలు

spot_img

కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చే  నిధులు రాకపోతే నోరు కూడా మెదపని  సన్నాసులు బీజేపీ వాళ్ళని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. భారతదేశానికి దిక్సూచిలా తెలంగాణ రాష్ట్ర పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు..శంకుస్థాపనలు చేశారు మంత్రి కేటీఆర్. ఆ తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.

30వేల కోట్లతో దామరచర్లలో అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ ను తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోందన్నారు మంత్రి కేటీఆర్. ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా నీరు ఇచ్చిన ఏకైక రాష్ట్రం మన  తెలంగాణ అని అన్నారు. తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవలని కుట్రలు చేస్తున్నది బీజేపీ పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ వల్ల ఒక దళితుడిగాని, ఒక గిరిజనుడు గాని.. బాగుపడ్డ దాఖలాలు లేవని తెలిపారు. ఇవాళ ఇంటింటికి సీఎం కేసీఆర్ పథకాలు అందుతున్నాయని చెప్పారు. తెలంగాణలో పల్లె ప్రగతి ద్వారా అద్భుతంగా పల్లెలు బాగు పడ్డాయి.. భారతదేశంలోనే తెలంగాణా గ్రామ పంచాయితీలు గొప్ప గుర్తింపు తెచ్చుకున్నాయన్నారు.

ఉప ఎన్నికల తర్వాత హుజూర్ నగర్ నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు మంత్రి కేటీఆర్. ఎవరి వల్ల రాష్ట్రం ముందుకు పోతుందో ప్రజలే గమనించాలన్నారు. టీఆర్ఎస్ పార్టీ..బీఆర్ఎస్ గా మారింది ..దేశాన్ని బాగు చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని తెలిపారు.

కేవలం తెలంగాణలో మాత్రమే 80 వేల  ఉద్యోగాల నోటిఫికేషన్ లు ఒకే ఏడాదిలో ఇవ్వడం జరిగింది…ఇది రికార్డ్…అని అన్నారు మంత్రి కేటీఆర్. మతాల మధ్య పంచాయతీ పెట్టడం బీజేపీ పద్ధతి అని…ఆ పార్టీ ఉచ్చులో యువత పడొద్దని సూచించారు. కిషన్ రెడ్డి లాంటి సన్నాసి నోటికి ఎన్ని వస్తే అన్నిఅబద్దాలు మాట్లాడుతాడు….నిలదీస్తే  సమాధానం చెప్పడని అన్నారు. బీజేపీ వల్ల కార్పొరేట్ శక్తులు బాగు పడ్డాయి.. ప్రజలు మరింత అగాధం లోకి జారీ పోయారన్నారు. మోడీ వల్ల దేశం అప్పుల పాలైందన్న మంత్రి కేటీఆర్… దేశం అభాసు పాలైందని..దేశానికి వేగు చుక్క మన తెలంగాణ మాత్రమేనని తెలిపారు.

Latest News

More Articles