మిస్ ఇండియా USA-2023గా రిజుల్ మైనీ నిలిచారు. న్యూజెర్సీలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రిజుల్ మైనీకి అందాల కిరీటం తొడిగారు. భారత సంతతికి చెందిన 24ఏళ్ల మైనీ మిషిగన్ యూనివర్సిటీ మెడికల్ విద్యార్థిని. ఆమె మోడల్ కూడా. వర్జీనియాకుచెందిన గ్రీష్మాభట్ రెండ స్థానంలో నిలిచారు. నార్త్ కరోలినాకుచెందిన ఇషితా పాయి రాయికర్ మూడోస్థానంలో నిలిచారు. మిస్ ఇండియా యూఎస్ఏ, మిస్టర్ ఇండియా యూఎస్ఏ, మిస్ టీన్ ఇండియా యూఏఎస్ లాంటి మూడు విభాగాల్లో నిర్వహించిన పోటీలకు 25 రాష్ట్రాల నుంచి మొత్తం 57మంది అభ్యర్థులు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు.
Indian-American medical student from Michigan crowned Miss India USA 2023#MissIndiaUSA #MrsIndiaUSA #MissTeenIndiaUSA @RijulMaini https://t.co/CIwTk0PR5E
— NewsDrum (@thenewsdrum) December 11, 2023
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ఫ్లెక్సీ చించారని బీఆర్ఎస్ నేతలపై పోలీసుల వేధింపులు