మహబూబ్ నగర్ జిల్లా: దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డిని ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఆల వెంకటేశ్వర రెడ్డి సోదరుడు ఆల శశివర్ధన్ రెడ్డి ఇటీవల గుండెపోటుతో మరణించారు. ఎమ్మెల్సీ కవిత మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలోని వెంకటేశ్వర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్సీ కవిత వెంట ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.