తిరుమలలో మరోసారి భద్రతా వ్యవస్థ డొల్లతనం బయటపడింది. నిన్న రాత్రి శ్రీవారి ఆలయంలోకి ఓ భక్తుడు మొబైల్ ఫోన్తో ప్రవేశించాడు. దాంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అధికారుల నిఘా వైఫల్యం బట్టబయలైంది. ఆదివారం రాత్రి శ్రీవారి ఆలయంలోకి మొబైల్ ఫోన్తో వచ్చిన భక్తుడు.. ఆనంద నిలయాన్ని అతి సమీపం నుంచి ఫోన్లో చిత్రీకరించాడు.
అంతేకాకుండా.. శ్రీవారి ఆలయంలోని పలు ఉప ఆలయాలను కూడా సెల్ ఫోన్లో వీడియో తీశాడు. అయినా కూడా ఆ భక్తుడిని ఎవరూ ఆపలేదు. దాంతో శ్రీవారిని దర్శించుకొని భక్తుడు తిరిగి వెళ్లిపోయాడు. అయితే విజిలెన్స్ అధికారుల వైఫల్యం పట్ల అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.