రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 15 వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు తెలిపింది. మార్చి 15 నుంచి రాష్ట్రంలోని అన్ని బడులను ఒంటిపూట మాత్రమే నిర్వహిస్తారని తెలిపింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లలో ఏప్రిల్ 22 వరకు ఒంటిపూట బడులు ఉండనున్నాయి. ఒంటిపూట బడుల నేపథ్యంలో ఉదయం 8గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 వరకు ఉంటాయి. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం 12.30 గంటల సమయం అందజేయనున్నారు. 10వ తరగతి పరీక్షల సమయంలో పరీక్షా కేంద్రాలున్న స్కూళ్లల్లో మాత్రం మధ్యాహ్నం పూట పాఠశాలలను నిర్వహిస్తారు.
ఇది కూడా చదవండి: ట్యాంక్ బండ్ పై త్వరలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు:సీఎం రేవంత్