Monday, May 20, 2024

ట్రావెల్స్‌ బస్సును ఢీకొట్టిన కారు.. ఆరుగురు మృతి

spot_img

మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాన్పా సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ మహిళ, చిన్నారిలను సమీప ఆస్పత్రికి తరలించారు. వారిలో చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కారు నాగ్‌పూర్‌ నుంచి నాగ్‌భీడ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, ఘనటపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Latest News

More Articles