Tuesday, May 21, 2024

వీకెండ్ రైడ్.. డెడ్ ఎండ్‎ను ఢీకొట్టిన కారు ముగ్గురు మృతి

spot_img

శుక్రవారం రాత్రి నగర శివారులోని పహాడీషరీఫ్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

Read Also: లింగ మార్పిడి చేయించుకొని, పెళ్లి చేసుకొని తండ్రి అయిన మహిళ

పాతబస్తీ ఫతేదర్వాజాకు చెందిన మొహ్మద్‌ సాజిద్‌(18), హసన్‌నగర్‌ వాసులు మొహ్మద్‌ అక్బర్‌(22), నయీముద్దీన్‌(21), లంగర్‌హౌస్‌ నివాసి రాహిల్‌ భార్య నాజియాబేగం(23), టోలిచౌకికి చెందిన సల్మాన్‌ఖాన్‌ భార్య ముస్కాన్‌ మహరాజ్‌(22)లు బెలీనో కారులో నగర శివారులోని పహాడీషరీఫ్‌ మీదుగా విమానాశ్రయానికి చేరుకున్నారు. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత శ్రీశైలం రోడ్డుపై చక్కర్లు కొట్టి.. అక్కడి నుంచి మామిడిపల్లి మార్గంలోకి ప్రవేశించారు. ఆ రోడ్డులో రోడ్ సైన్ బోర్డు లేకపోవడంతో వేగంగా వెళ్తున్న వారి కారు.. డెడ్ ఎండ్‎లో ఉన్న రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా.. డ్రైవింగ్‌ సీటులో ఉన్న సాజిద్‌, పక్కనే కూర్చున్న అక్బర్‌, వెనుక ఉన్న నాజియాబేగం శరీరాలు ఛిద్రమై సంఘటన స్థలంలోనే మరణించారు. మరో ఇద్దరు నయీముద్దీన్‌, ముస్కాన్‌ బేగంలు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Latest News

More Articles