Monday, May 20, 2024

7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా పై టీమ్‌ఇండియా ఘన విజయం

spot_img

దక్షిణాఫ్రికా పర్యటన ను టీమ్‌ఇండియా ఘన విజయంతో ముగించింది. సఫారీలతో జరిగిన రెండో టెస్టులో భారత్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో  రెండు టెస్టుల సిరీస్‌ను రోహిత్ సేన 1-1 తేడాతో సమం చేసింది. తొలి ఇన్నింగ్స్ లో ఆతిథ్య జట్టు 55 పరుగులకు ఆలౌట్‌ కాగా.. టీమ్ ఇండియా 153 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికాను టీమ్‌ఇండియా 176 పరుగులకు కట్టడి చేసింది.  ఆ తర్వాత 79 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 12 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యశస్వి జైస్వాల్ (28; 23 బంతుల్లో 6 ఫోర్లు), రోహిత్ శర్మ (17*; 22 బంతుల్లో 2 ఫోర్లు) దూకుడుగా ఆడారు. విరాట్ కోహ్లీ (12), శుభ్‌మన్‌ గిల్ (10), శ్రేయస్ అయ్యర్ (4*) పరుగులు చేశారు.

సౌతాఫ్రికా బౌలర్లలో రబాడ, నండ్రీ బర్గర్, మార్కో జాన్సన్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టెస్టు కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలుకుదామనుకున్న డీన్ ఎల్గర్‌కు నిరాశే ఎదురైంది. బ్యాటింగ్‌లోనూ అతడు విఫలమయ్యాడు. మొత్తంగా రెండు మ్యాచ్ ల సిరీస్ డ్రాగా ముగిసింది.

ఇది కూడా చదవండి:  నాలుగు నెలల తర్వాత మరోసారి ప్రజాపాలన

Latest News

More Articles