Monday, May 20, 2024

ఎమ్మెల్సీగా మీర్జా రహ్మాత్ ప్రమాణ స్వీకారం

spot_img

తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలోని చైర్మన్ ఛాంబర్ లో ఎం.ఐ.ఎం పార్టీ నుండి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నూతనంగా ఎన్నికైన మీర్జా రహ్మాత్ బేగ్ గారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.

ఈ కార్యక్రమంలో శాసన సభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ గారు,మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెరాజ్ ,యాకత్ పూర ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి , తెలంగాణ లెజిస్లేచర్ సెక్రెటరీ డా’ నరసింహా చార్యులు, టి ఆర్ యస్ ఎల్పీ కార్యదర్శి రమేష్ రెడ్డి, ఎం .ఐ. ఎం పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.

Latest News

More Articles