ములుగు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకున్నది. ములుగు మండలం మల్లంపల్లి శివారులో ఆస్తి తగాదాలతో అన్నను తమ్ముడు, అతని భార్య విద్యుత్ షాక్ ఇచ్చి హత్య చేసారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజుపల్లె గ్రామానికి చెందిన అన్న కావటి బిక్షపతి, తమ్ముడు సుధాకర్ మధ్య గత కొన్ని సంవత్సరాలుగా భూవివాదం ఉంది. ఈ క్రమంలో అన్నను తమ్ముడి అతని భార్య కలిసి హత్య చేశారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Also Read.. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు 40 సీట్లు కూడా కష్టమే