తమిళనాడు రాష్ట్రంలో కల్తీసారా తాగి ముగ్గురు మృతి చెందగా..మరో పది మంది పరిస్థితి విషమంగా ఉంది. రాష్ట్రం లోని విల్లుపురం జిల్లా మరకానంలో కల్తీ సారా తాగి ముగ్గురు మృతి చెందారు. మరో పది మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై రాష్ట్ర సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ సారా తయారీ దారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. కల్తీ సారా కారణంగా చనిపోయిన కుటుంబ సభ్యులకు రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు సీఎం స్టాలిన్.