Monday, May 20, 2024

శిల్పకళావేదికలో 3రోజులపాటు ‘వరల్డ్ టూరిజం డే’ వేడుకలు

spot_img

హైదరాబాద్: మాదాపూర్ శిల్పకళావేదికలో జరుగుతున్న వరల్డ్ టూరిజం డే 2023 వేడుకలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. దీనికి టూరిజం శాఖ కమీషనర్ ఐఏఎస్ శైలజ రామయ్యర్, టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎండీ మనోహర్, డైరెక్టర్ నిఖిల హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు తో పాటు దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరుగనున్నాయి.

Also Read.. సుప్రీంలో బాబు కేసు పెండింగ్.. ఈ నెల 28 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం లో ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో పర్యాటక శాఖ బాగా అభివృద్ధి చెందిందన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఈ మూడు రోజులు వరల్డ్ టూరిజం డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు విచ్చేసిన ప్రతినిధుల కోసం తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ కూడా ఏర్పాటు చేశామన్నారు. టూరిజం అభివృద్ధి లో భాగంగా ప్రతి చెరువు వద్ద బోటింగ్ సౌకర్యంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Latest News

More Articles