Tuesday, May 14, 2024

సెలూన్ యజమాని అత్యాచార యత్నం..శానిటైజర్ తాగి యువతి ఆత్మహత్య

spot_img

రంగారెడ్డి జిల్లా: మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధి లోని టీచర్స్ కాలనీలో ఉన్న ఓ సెలూన్ లో పనిచేసే మహిళా సానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండకు చెందిన దివ్య (18) ది బాబ్ సెలూన్ లో పనిచేస్తుంది. ఈ క్రమంలో యజమాని మురళి ఆమెను లైంగికంగా వేధించేవాడు. ఈ క్రమంలో మంగళవారం సెలూన్ లో ఉన్న ఓ గదిలోకి దివ్యను తీసుకెళ్లి మానభంగం చేసే ప్రయత్నం చేశాడు మురళి. అతడి నుంచి తప్పించుకున్న దివ్య బయటకు వచ్చి కేకలు వేసింది. దీంతో మురళి అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర మనస్థాపానికి గురైన దివ్య సెలూన్ లో ఉన్న శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకుంది. మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి దివ్య మృతదేహాన్ని తరలించారు.

Also Read.. సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై మావోయిస్టుల దాడి.. 13మంది జవాన్‌లకు గాయాలు..!

Latest News

More Articles