మహారాష్ట్ర పర్భానీ జిల్లాలో దారుణం జరిగింది. సెప్టిక్ ట్యాంక్ ని శుభ్రం చేస్తుండగా వెలువడిన విషపూరిత వాయువులు పీల్చి ఐదుగురు కార్మికులు చనిపోయారు. మరో కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది. విషమంగా ఉన్న బాధితుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. సోన్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భౌచా తండాలో ఈ ఘటన జరిగింది. ఆరుగురు కూలీలు ఓ పొలంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్లోకి దిగారు. ట్యాంక్ను శుభ్రం చేస్తుండగా ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. ఐదుగురు కార్మికులను అక్కడికి చేరుకునే లోపే మృతి చెందినట్లు డాక్టర్లు కన్ఫాం చేశారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన సోన్పేట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
5 Die After Inhaling Toxic Fumes While Cleaning Septic Tank In Maharashtra