Saturday, May 18, 2024

నగర శివారులోని హోటల్లో నకిలీ కరెన్సీ తయారీ.. పట్టుకున్న పోలీసులు

spot_img

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న ముఠాను ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తొండపల్లి వద్ద ఉన్న ఓ హోటల్లో నకిలీ కరెన్సీ తయారుచేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు.. హోటల్ మీద దాడి చేశారు. అక్కడ నకిలీ కరెన్సీ, కరెన్సీ తయారు చేసే మిషన్లతో పాటు ఇద్దరు నిందితులను కూడా టాస్క్‎ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు సంబంధించిన పూర్తి వివరాలను శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి వెల్లడించనున్నారు.

Latest News

More Articles