Sunday, May 19, 2024

ఉత్తర ప్రదేశ్ రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి

spot_img

ఉత్తరప్రదేశ్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షాజహాన్‌పుర్‌ జిల్లాలో ఆటోను ట్యాంకర్‌ ఢీకొన్న ఘటనలో 12 మంది మృతి చెందారు. దట్టమైన మంచు కారణంగా  ఇవాళ(గురువారం) ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

జలలాబాద్ నుంచి ప్రయాణికులతో వస్తున్న ఆటోను ఎదురుగా రాంగ్‌ రూట్‌లో వస్తున్న ఒక ట్యాంకర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 12 మంది స్పాట్ లోనే చనిపోయారు. బరేలీ-ఫరూఖాబాద్‌ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి:TSPSC కొత్త చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి

Latest News

More Articles