బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఉత్తర అమెజాన్ రాష్ట్రంలోని బార్సిలోస్ ప్రావిన్స్లో శనివారం జరిగిన విమాన ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. మృతుల్లో 12 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ఇక మరణించిన వారిలో అమెరికా పౌరులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
అమెజాన్ రాష్ట్ర రాజధాని మనౌస్కు 400 కిమీ (248 మైళ్లు) దూరంలో ఉన్న బార్సిలోస్ ప్రావిన్స్లో ఈ విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంకు గురైన విమానం ‘మనౌస్ ఏరోటాక్సీ’ ఎయిర్లైన్స్కు చెందింది. ప్రమాదం జరిగిందని మనౌస్ ఏరోటాక్సీ ఎయిర్లైన్స్ ఓ ప్రకటన విడుదల చేసినా.. మరణాల గురించి ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. దర్యాప్తుకు అన్ని విధాలుగా తాము సహకరిస్తామని ఎయిర్లైన్స్ అధికారులు తెలిపారు. ట్విన్-ఇంజన్ టర్బోప్రాప్, 18-ప్రయాణికుల సామర్థ్యం గల EMB-110 ఈ విమానాన్ని బ్రెజిలియన్ ఎయిర్క్రాఫ్ట్ మేకర్ ఎంబ్రేయర్ తయారు చేసింది.