హైదరాబాద్: తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ఉన్న ఇన్స్పెక్టర్ లకు పదోన్నతి కల్పించారు. 141 మంది ఇన్స్పెక్టర్స్ కు డీఏస్పీ లుగా పదోన్నతులు ఇచ్చారు. ఈ మేరకు డీజీపీ అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
1996,1998 బ్యాచ్ కు చెందిన 141మందికి పదోన్నతిని కల్పించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని, ఈ నిర్ణయాన్ని ప్రకటించడానికి గొప్పగా ఫీలవుతున్నానని డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు.