వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని రేగడి మైలారం గ్రామంలో ఓ పిచ్చికుక్క దాడి పిల్లపై దాడి చేసింది. దాడిలో 15 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఆరుగురిని హైదరాబాద్ తరలించగా.. మిగతా వారిని ప్రవేట్ ఆసుపత్రులకు తరలించారు. ఇవాళ (ఉదయం) స్కూల్ కి వెళ్లే సమయంలో పిచ్చికుక్క దాడి చేసింది. చికిత్స పొందుతున్న చిన్నారులందరూ క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.