కేరళ మలప్పురంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. తానూరులోని కెట్టుంగల్ బీచ్ వద్ద పర్యటకుల బృందంతో వెళ్తున్న పడవ సాయంత్రం 7.30 గంగలకు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందారు. మృతుల్లో 5 మంది చిన్నారులు ఉన్నారు. పర్యాటకులతో పడవ కిక్కిరిసిపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 30 మంది వరకు ఉన్నట్లు తెలిపారు.