Tuesday, May 7, 2024

నేడు మంచిర్యాల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

spot_img

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో ఈరోజు మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. కేటీఆర్ తోపాటు మంత్రులు, కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య  పాల్గొననున్నారు. ఈ సందర్భంగా 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, మిషన్ భగీరథ సంప్ ను ప్రారంభించనున్నా మంత్రి కేటీఆర్. అలాగే కేటీఆర్ చేతుల మీదుగా సింగరేణి పట్టాల పంపిణీ చేస్తారు. బహిరంగ సభ నిర్వహించే బెల్లంపల్లి ఇప్పటికే గులాబీ మయమైంది. మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని బీఅర్ఎస్ శ్రేణులకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపునిచ్చారు.

Latest News

More Articles