కన్నకొడుకుపై మరుగుతున్న నూనె పోసి చంపిన ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. మద్యం మత్తులో దాడిచేసిన కుమారుడిపై తల్లి, అతని పెద్దమ్మ కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరువణ్ణామలై జిల్లా వందవాసి సమీప తెన్నాంగూర్ గ్రామనికి చెందిన సురేశ్ 35 మద్యానికి బానిసగా మారాడు. అతనికి ఇంకా వివాహం కాలేదు. రోజూ మద్యం తాగివచ్చి ఇంట్లోఉన్న తల్లి రుక్మిణీ, పెద్దమ్మ మునియమ్మను వేధిస్తుండేవాడు. ఆదివారం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన సురేశ్ తనకు పెళ్లి చేయాలని తల్లి, పెద్దమ్మతో గొడవకు దిగాడు. మద్యానికి బానిసైన అతనికి ఎవరూ పిల్లనివ్వరని అనడంతో ఆగ్రహించిన సురేశ్ వారిపై దాడికి దిగాడు. ఈ క్రమంలోనే తల్లి, పెద్దమ్మ మరుగుతున్న వంటనూనె అతని తలపై పోశారు. బాధభరించలేక కిందపడ్డ అతని తలపై బండరాయితో మోదీ చంపారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్ని శవాన్ని పోస్టు మార్టం కోసం తరలించారు. నిందితులను ఇద్దర్నీ అరెస్టు చేశారు.